మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లయన్స్ క్లబ్ మణుగూరు, మరియు వాసవి క్లబ్ మణుగూరు సంయుక్తంగా మణుగూరు మండలంలో పెద్ద విస్తీర్ణంలో సేంద్రియ వ్యవసాయం చేస్తూ వ్యవసాయదారులకు ఆదర్శంగా నిలుస్తున్న, పిల్లారిషెట్టి.హరిబాబు,కముజు.చంద్ర మోహన్ లను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తలురి.రమేష్ బాబు విచ్చేసి ఉత్తమ రైతులను సన్మానించారు.ఈ సంధర్బంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కడవెండి. విశ్వనాధ్ గుప్తా మాట్లాడుతూ,రైతు పది వేళ్ళు మట్టిలోకి వెళ్తేనే మన అయిదు వేళ్ళు నోట్లోకి వెళ్తాయి అని అన్నారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో వ్యవసాయం ను పండుగ చేస్తున్న వ్యక్తి హరిబాబు,చంద్ర మోహన్ ఇరువురి సేవలను కొనియాడారు.రైతు దేశానికి వెన్నుముక అని రైతులని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ గాజుల.పూర్ణ చందర్ రావు,తార ప్రసాద్, కృష్ణ మోహన్,కొల్లూరి. మోహన్ రావు,కృష్ణ మూర్తి, బండారి.నర్సింహరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: