మన్యం టీవీ, అశ్వరావుపేట:మండల పరిధిలోని మద్దికొండ గ్రామ పంచాయితీ లో సర్పంచ్ తాటి భవాని అద్వర్యం లో తెరాస పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ భవాని భర్త కన్నారావు జమ్మిగూడెం, మద్దికొండ గ్రామ పంచాయితీల తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా జమ్మి గూడెం గ్రామపంచాయతీ తెరాస గ్రామ అధ్యక్షుడు రాజిన నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆప్యాయతికి మారు పేరు జారే ఆదినారాయణ అని, అతి తక్కువ సమయం లో నియోజక వర్గ లో వున్నా 5 మండలాలు అబిమానులను సంపాదించుకున్నారు, నిరంతరం ప్రజా సేవకు పరితపించే గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ సందర్భంగా రెండు గ్రామపంచాయతీల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ ఆదినారాయణ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో మద్దికొండ తెరాస గ్రామ అద్యక్షుడు తాటి రామకృష్ణ, వార్డ్ మెంబర్స్ ముద్దిన రామ్, సురేష్, యూత్ నాగార్జున, నెర్స్ శ్రీను, ఎం వెంకటేశ్, బేతి రవీంద్ర, కార్యకర్తలు డండి మారేష్, సింగులూరి కృష్ణ, డండి శ్రీను, కిష్టా సుబ్బయ్య, శ్రీరామ్ మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: