మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐసిడిఎస్ ప్రాజెక్టు నందు ఎన్నో ఏళ్లుగా తల్లి, పిల్లలను సంరక్షించే వృత్తిలో కొనసాగుతున్న అంగన్ వాడీ లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో లో ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిఐటియు అధ్యక్షురాలు వీసం వెంకటమ్మ మాట్లాడుతూ. . నిత్యం వెట్టిచాకిరి చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తల విషయం లో ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయన్నారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలన్నారు. కనీస వేతనం, పెన్షన్ సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల కన్వీనర్ ఆలేటి కిరణ్, ఫాతిమా, శ్రీలత, దీప్తి, రాంబాయి, వెంకటమ్మ, తిరుమల, చంద్రకళ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: