👉 ఆన్లైన్ చదువులపై మక్కువ లేక చేపల వేట
👉పిల్లలపై శ్రద్ధ చూపని విద్యాశాఖ అధికారులు
గుండాల జూలై 13 (మన్యం మనుగడ) చదువు లేక చాప చిక్కక అన్న సందర్భంగా గుండాల ఆళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఆన్లైన్ చదువులపై పెద్దగా ఇష్టం లేని పిల్లలు చేపల వేటకు మరియు మేకలు ఆవులు కాసుకుంటూ దర్శనమిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు పిల్లలపై శ్రద్ధ చూపకపోవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుండి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తుంటే స్థానిక విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా బడులకు హాజరుకాకుండా తమ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తల్లిదండ్రులు చేలు పనులకు వెళ్తే పిల్లలు స్థానిక చెరువులు వాగుల వద్దకు చేపల వేటకు వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. మంగళవారం జామర గూడెం గ్రామ సమీపంలో గల వాగు వద్ద చేపల వేట తో మన్యం మనుగడ కెమెరా కంట పడ్డారు ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి అధ్యాయాలు విధులకు హాజరై ఆన్లైన్ తరగతులు వీక్షించే ఎలా పిల్లలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది
Post A Comment: