మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువు నిండి అలుగు పడ్డ విషయం తెలుసుకున్న ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చెరువు సందర్శించారు. చైర్మన్ మాట్లాడుతూ. .అలుగు పడ్డ ఇల్లందుపాడు చెరువును చూస్తూ ఉంటే కనువిందుగా ఉందని తన ఆనందం వ్యక్తపరిచారు. నెల క్రితమే అలుగు ప్రదేశాన్ని శుభ్రం చేశామని అలుగు పడ్డ తరువాత నీళ్లు బోగత జలపాతంగా కనిపిస్తుందని తెలిపారు. అలుగు పడ్డ ప్రదేశానికి ఇల్లందు పట్టణ ప్రజలు కాకుండా ఇతర ఊరు వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు వస్తున్న వారికి మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ రెండో వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి, టిఆర్ఎస్ పార్టీ యువజన పట్టణ అధ్యక్షులు మెరుగు కార్తీక్, టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పెద్దనేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: