CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల కేంద్రం లో విద్యుత్ సమస్యను పరిష్కరించాలి.. సిపిఐ(ఎం)

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


మండల కేంద్రంలో నిరంతరం విద్యుత్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ ఏఈ దేవా ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  గత పది రోజుల నుంచి కరెంటు కోతతో పాటు కరెంట్ ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ రావడం వల్ల టీవీ, ఫ్రిడ్జ్, ఎలక్ట్రానిక్ వస్తువులు  పాడైపోయే అవకాశం ఉందని. అదేవిధంగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల గ్రామంలో విష సర్పాలు, దోమల బెడద కూడా ఎక్కువగా ఉంటుందని, దీని ద్వారా  డెంగ్యూ మలేరియా ప్రబలే అవకాశం ఉందని, వెంటనే విద్యుత్ సమస్యను పునరుద్ధరించాలని  సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సబ్ స్టేషన్ ను రైతులు గ్రామస్థులతో కలిసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ముట్టడి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో  సిపిఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల మోహన్ రావు, శాఖ కార్యదర్శి రాయి రాజా, అబ్దుల్ రెహమాన్, అప్పారి నాగేశ్వరావు, బత్తుల నాగేశ్వరరావు, పోటు వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: