మన్యం మనుగడ,కరకగూడెం: మండల పరిధిలోని కరకగూడెం,భట్టుపల్లి,సమాత్ భట్టుపల్లి,తాటిగూడెం,పద్మపురం,అనంతారం,సమాత్ మెతె,కొత్తగూడెం గ్రామ పంచాయితీలో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిర్లక్ష్యం వహించే సహించేది లేదని కరకగూడెం మండల స్పెషల్ ఆఫీసర్ కే.బాబురావు అన్నారు.
శుక్రవారం కరకగూడెం మండలంలోని వివిధ గ్రామపంచాయతిలో సందర్శించారు.
గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్ల ఇరుపక్కలా పిచ్చి మొక్కలు,చెత్త,మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలని సర్పంచులకు,కార్యదర్శులకు సూచించారు.
గ్రామల్లో ఉన్నటివంటి సమస్యలు లేకుండా సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు.అనంతరం ప్రజలకు మొక్కలు పంపిణీ చేసి,ఆర్ఎన్బి రోడ్లు పక్కన పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నటడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచులు భూక్య భాగ్యలక్ష్మి,పోలెబోయిన శ్రీవాణి,తాటి సరొజని,గోగ్గల నాగమణి,ఇర్ప విజయ్ కుమార్,బత్తిని నర్సింహారావు,కొమరం విశ్వనాధం,కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు,పంచాయతీ కార్యదర్శులు,గ్రామస్తులు,పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: