గుండాల జూలై 27 (మన్యం మనుగడ) గత సంవత్సరం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన పంచాయతీ కార్మికుల కుటుంబాలకు జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం 75 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గుండాల ఎంపీపీ సత్యం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఎంపీపీ ముక్తి సత్యం మాట్లాడుతూ మంచి మనసుతో సహాయం చేసిన కార్యదర్శులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకుంనందుకు గ్రామస్తులు వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వలి, కార్యదర్శుల సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్, బండి ఆనంద్ కుమార్, కార్యదర్శి త్రివేణి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: