మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలోని రమణ క్కపేట గ్రామానికి చెందిన పాత్రికేయుడు కోవిడ్-19 పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం నాడు రిపోర్టర్ కు 25 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులను అందజేశారు. రిపోర్టర్ కుటుంబ సభ్యులకు కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని వీరి పరిస్థితి తెలుసుకుని వీరిని పరమార్శించి వీరికి కూరగాయలు బియ్యం వంట సామాగ్రి సహాయం అందించారు సామాజిక మార్పుకోసం నిరంతరం శ్రమిoచి పేద ప్రజల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించి కడవరకు నిలిచే పోరాడే పాత్రికేయులకు మేమున్నాం అనే ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు ఇందారపు లక్ష్మణ్ రావు,ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు,సొసైటీ డైరెక్టర్ కోడం బాలకృష్ణ,గాంగేర్ల శ్రీను,మల్లికార్జున్,రామయ్య,అంజి బాబు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: