CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాలి : ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాష

Share it:



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం నందు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ జానీపాష పిలుపునిచ్చారు. ఇల్లందు మున్సిపాలిటీ పరిధి లోని స్థానిక 17 వ వార్డు నందు వైస్ చైర్మన్ వార్డులోని ప్రతి ఇంటి ఇంటికి మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. . మొక్కలు నాటి వాటిని సంరక్షించడం మన సామాజిక బాధ్యత అని ప్రజలకు సూచించారు. మొక్కల పెంపకం లో 17వ వార్డు గ్రీన్ వార్డు గా నెలకొల్పి మునిసిపాలిటీ అందించే బహుమతి లో ప్రథమ స్థానం సాధించేందుకు హరితహారం ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు అందరు భాగస్వామ్యులు కావాలని కోరారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ ఇంటి పరిసరాలను వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని వార్డు సభ్యులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: