CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం సిపిఐ...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు, జూలై 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని రాంపురం, ఎలుకలోడ్డు, గ్రామాల పోడు భూముల సాగు దారులతో కలిసి సిపిఐ మండల కార్యదర్శి గుండెపిన్ని వెంకటేశ్వర్లు ఆ ప్రాంత అటవీ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, లతో శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాంపురం, ఎలక లోడ్డు ప్రాంతంలో క్లైమ్ నెంబర్, క్యాట్ లాగ్, మ్యాప్ లు ఉన్న భూముల జోలికి వెల్లోదనీ వాటిని సమగ్ర విచారణ జరిపిన తర్వాతే ప్లాంటేషన్ పనులు మొదలుపెట్టాలని అన్నారు. రైతుల సమస్యలను, వారికి అర్థమయ్యే విధంగా తెలియజేసి, సమస్యలను పరిష్కరించాలని, మొక్కలు నాటడం సరికాదని, మొక్కలు నాటిన ఎడల ఆందోళనకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు షేక్ నాగుల్ మీరా, రైతులు మడి సీతారాములు, బచ్చల నాగేశ్వరరావు ,భానోత్ రాజు, రమేష్, బుర్ర బిక్షం, పాయం కనకయ్య, భూక్య లక్ష్మి భానోత్ సక్కు ధారావత్ రంగమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: