చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
చండ్రుగోండ మండలం కేంద్రం నుండి గుర్రాయిగూడెం గ్రామీణ లింక్ రోడ్డు నుండి సుమారు 35 నుండి40 టన్నుల లోడుతో రైల్వే ట్రాక్ కు వేసే కంకర లోడ్ తో లారీలు తిరగటం వల్ల రోడ్డు పూర్తిగా ద్వంసం అవటంతో గుర్రాయిగూడెం ,బెండలపాడు,పోకలగూడెం గ్రామాల ప్రజలు నిత్యం చండ్రుగోండ మండల కేంద్రానికి వస్తుంటారు. రోడ్డు పూర్తిగా ద్వంసం అవటంతో వాహనదారులు క్రింద పడటంతో ప్రమాదాలకు గురవుతున్నారు. పలు సార్లు సదరు కాంట్రాక్టరకు సమస్య తెలిపిన వారు స్పదించక పోవడంతో రైతులు గ్రామస్తులు కలసి లారీలు ఆపటం జరిగిందని ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు లారీలు వదిలేది లేదని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గ్రామస్థులు పాల్గొన్నారు.
Post A Comment: