ఎక్సైజ్ సీఐ వి రాజశేఖరరావు
గుండాల జూలై 31 (మన్యం మనుగడ) నాటుసారా కాసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఇల్లందు ఎక్సైజ్ సీఐ వి రాజ శేఖర్ రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో నాటు సారా కాస్తున్నారా అన్న సమాచారంతో దాడి చేయగా మండల కేంద్రంలోని తండాకు చెందిన ధరావత్ అలియా వద్ద నాటుసారా విక్రయిస్తున్న గా పట్టుకున్న మన్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులు పట్టుకొని ఎమ్మార్వో వద్ద బైండోవర్ కేసు నమోదు చేసిన తాను మాత్రం నాటుసారా విక్రయిస్తున్నారని ఈరోజు కేసు నమోదు చేసి 20 వేల రూపాయల జరిమానా విధించి ప్రభుత్వ ఖాతాలో జమ చేశామన్నారు. గతంలో సైతం ఉల్లంఘనలు చేసిన నరేష్, జగన్, సరిత, సురేష్ ల వద్ద కూడా 25 వేల వసూలు చేశామన్నారు. ఇప్పటివరకు లక్ష 5000 రూపాయలు జరిమాన రూపంలో వసూలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ ఐ రమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: