CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెగిన సీతారామ ప్రాజెక్ట్ తాత్కాలిక కట్ట నీట మునిగిన పంట పొలాలు

Share it:

 



-  లేకపోతే పురుగుమందే శరణ్యం అంటున్న రైతులు..


చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామం శివారు లో నిర్మాణంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ తాత్కాలిక కట్ట తెగి పంట పొలాలు మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు కాలువ వల్ల మూడు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గత సంవత్సరం కూడా పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలతో వరదనీరు ఎటూ వెళ్ళే పరిస్థితి లేక  పంటపొలాలు మునిగి పొయి తీవ్ర నష్టం వాటిల్లిందని   ఈ సంవత్సరం కూడా అప్పులు తీసుకొచ్చి  అధిక పెట్టుబడులు పెట్టి పత్తి పంటలు వేసామని మళ్లీ కాల్వ తెగి వరదనీరు పంటలు మొత్తం మునిగిపోయాయని  ఇదే విషయాన్ని అటు కాంట్రాక్టర్లు ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు తెలియజేద్దాం అనుకుంటే ఎవ్వరూ కనిపించడం లేదు. ప్రాజెక్టు అధికారులు ఫోన్ ద్వారా సమస్యను తెలిపిన స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులందరం కలిసి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని  రైతులు హెచ్చరిస్తున్నారు... 


ఇదే విషయంపై తహసిల్దార్ ఎం ఉష శారద ను వివరణ కోరగా.. రైతులు ఎవరు అధైర్య పడవద్దని  సీతారామ ప్రాజెక్టు నిర్మాణ అధికారులు కాంట్రాక్టర్ తో మాట్లాడి.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తానని రైతులు ఎవరు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పోట్రు ఝాన్సీ, పోట్రు వినోదా, గౌతమి,  పోట్రు అనిల్,  పోట్రు వేణు, ఎన్ శ్రీను, రామారావు, తదితరులు పాల్గొన్నారు...

Share it:

Post A Comment: