CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్మశాన వాటికకు రోడ్ నిర్మాణం చేపట్టండి

Share it:

 



👉🏻బాబు జగ్జీవన్ రామ్ కాలనీ వాసుల డిమాండ్.

👉🏻 తహసీల్దార్ గారికి  వినతిపత్రం.



మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం గ్రామ మేజర్ పంచాయతీ వారు స్మశాన వాటికను ఏర్పాటు చేశారు.కానీ చివరి మజిలీకి వెళ్ళడానికి మాత్రం రహదారిని ఏర్పాటు చేయలేదు.ఎవరైనా చనిపోతే స్మశాన వాటిక దగ్గరకి తీసుకెళ్లాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చనిపోయిన వారిని తీసుకెళ్లాలి అంటే ఊరు మధ్యలో నుండి వెళ్ల వలిసి వస్తుంది.ఎన్నో ఏళ్ళుగా స్మశాన వాటికకు రహదారి ఉన్నప్పటికీ అట్టి రహదారికి ఎవరూ వెళ్ళకుండ  పెన్సింగ్ ఏర్పాటు చేయడంతో ఆ రహదారి నుండి వెల్లడం చాలా కష్టంగా ఉంది.కావునా ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రహదారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ రోజు శుక్రవారం నాడు స్థానిక తహశీల్దార్ వి.సురేష్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాణోత్ శారదా ,ఉప-సర్పంచ్ భూక్యా చందు లాల్ ,గ్రామ పెద్దలు సదర్ లాల్,గద్దల రామకృష్ణ, ఇసంపల్లి లింగన్న,చుంచు ప్రవీణ్,ప్రవీణ్,సాంబ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: