*గోవిందరావుపేట కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు చింత క్రాంతి.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం లోని కర్లపల్లి గ్రామంలో ఉన్న గుండ్ల వాగు ప్రాజెక్టుకు సరైన మరమ్మతులు లేక కుడి, ఎడమ కాలువలకు గండ్లు పడ్డాయి. మరియు ప్రాజెక్టు యొక్క గేట్లు కూడా తుప్పు పట్టేసరికి వరద నీరు ఉధృతంగా వచ్చి పంట పొలాలను ముంచెత్తుతుంది అని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు చింత క్రాంతి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టిన ఈ గుండ్ల వాగు ప్రాజెక్టు కు గత పది సంవత్సరాల నుండి సరైన మరమ్మతులు చేయకపోవడం వలన ప్రాజెక్టు కుడి,ఎడమ కాలువలకు గండ్లు పడి సుమారుగా 15 వందల ఎకరాల పంట నష్టం వాటిల్లుతుందని దీనివలన రైతులు ఎంతో నష్ట పోతున్నారని అన్నారు. ములుగు జిల్లా సంబంధిత అధికారులకు తెలిపినప్పటికీ ఎటువంటి స్పందన లేదు అని క్రాంతి ఆరోపించారు. కనీసం పంట మునిగిపోయి పంట నష్టపోతున్న రైతులకు పంట నష్టం కూడా చెల్లించడం లేదని రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వానికి మా రైతుల యొక్క బాధలు పట్టించుకునే స్థితిలో లేదు అని అన్నారు. ఈ ప్రభుత్వాలు ఎలాగో పట్టించుకోవడం లేదని తెలుసుకున్న గ్రామస్తులు చందాలు చిన్న కాలువలను తవ్వించు కుంటూ గండ్లను పుడ్చు కుంటున్నారని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరిచి సత్వర పరిష్కారం మార్గం చూపించి వెంటనే మరమ్మతు పనులు ప్రారంభించాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తామని క్రాంతి అన్నారు.
Post A Comment: