గుండాల జూలై 16 (మన్యం మనుగడ) నిరుద్యోగ సమస్యపై చలో కలెక్టరేట్ మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీ వై ఎల్ జిల్లా నాయకులు అట్టి కం శేఖర్ మాట్లాడుతూ. జిల్లా కమిటీ పిలుపుమేరకు శుక్రవారం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 29వ తారీఖున చలో కలెక్టరేట్ కార్యక్రమం పార్టీ తలపెట్టిన దని దాన్ని విజయవంతం చేసే విధంగా గ్రామ గ్రామాన ర్యాలీలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. నిరుద్యోగులు ఏండ్ల తరబడి నిరీక్షించిన ఉద్యోగాలు రాకపోవడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టామన్నారు. లక్ష 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ప్రభుత్వం స్పందించటం లేదని తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎనుగంటి లాజర్, రమేష్ , కృష్ణ , దామోదర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: