CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉రైతులను నకిలీ విత్తనాల బారినపడకుండా కాపాడాలి: నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం జూలై 16:- శుక్రవారం నాడు నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల కోసం కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను వివరిస్తూ వారి హక్కుల పరిరక్షణకై కమిషన్ చేస్తున్నా కృషిని జిల్లా కలెక్టర్ కి వివరించారు, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల బారినపడి అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని అలాంటివారికి సత్వరమే న్యాయం చేసి, నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుడా మేలుకో నీ హక్కును తెలుసుకో అంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ ని శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు.ఈ కార్యక్రమంలో నేషనల్ కన్స్యూమర్ రైట్ కమిషన్ సభ్యులు, టివిపిఎస్ అధ్యక్షులు సతీష్ గుండపునేని,కన్జ్యూమర్ రైట్స్ మెంబర్స్,ఆలూరి నాగరాజు, 

ముత్యాల క్రాంతి కిరణ్, 

కంకణాల ఉజ్జు,వంశీకృష్ణ శనగల తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: