*మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు పోలీసుల వినూత్న ప్రయత్నం.
*మావోయిస్టు వారోత్సవాలు సందర్భంగా పోలీసులు విస్తృత తనిఖీలు.
మన్యం టీవీ ఏటూరు నాగారం
మండల కేంద్రంలోని ఏజెన్సీ గ్రామాలను పోలీసులు డ్రోన్ కెమెరా సహాయంతో గుత్తి కోయ గుంపులో మరియు అటవీ ప్రాంతాలను,గోదావరి పరివాహక ప్రాంతాలను, రహదారులను నిఘా నీడలో అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు సందర్భంగా నిశ్శబ్దంగా ఉన్న ఏజెన్సీ గిరిజన గ్రామాలు ఒక్కసారిగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాయి. రహదారులపై కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో సివిల్ సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: