🔥విద్యుత్ తీగల కింద మొక్కలు నాటారు
🔥ఏపుగా పెరిగాక నరికారు
మన్యం మనుగడ, అశ్వారావుపేట:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం నిర్వహిస్తుంది. కానీ అశ్వారావుపేట నియోజకవర్గంలో అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఏపుగా పెరిగిన మొక్కలు నరకడం జరిగింది. అశ్వారావుపేట మండలంకేశప్ప గుడేం పంచాయతీలో ముందు చూపు లేకుండా విద్యుత్ తీగల కింద మొక్కలు నాటారు .ప్రస్తుత ఏపుగా పెరగడంతో విద్యుత్ తీగలకు తగులుతున్నాయనే కారణంతో నరికివేశారు. అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: