CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యంలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం

Share it:


  మన్యం టీవీ ఏటూరు నాగారం  ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపూర్ కాలనీ గ్రామ సమీపంలోని వాజేడు మండలం నుండి భద్రాచలం వెళ్లే రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు మావోయిస్టుల వాల్ పోస్టర్లు, కరపత్రాలను ఏర్పాటు చేశారు.ఈ కరపత్రాలలో (ఈనెల) జూలై 28వ తేదీ నుండి ఆగస్టు మూడో తారీకు వరకు మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు గ్రామగ్రామాన జరుపుకోవాలని అమరులైన మావోయిస్టులకు ప్రతి ఒక్కరు జోహార్లు తెలియజేయాలని పేర్కొన్నారు.ఈ వాల్ పోస్టర్లు, కరపత్రాలు చర్ల- శబరి ఏరియా కమిటీ పేరుతో ఉన్నాయి. మారుమూల ప్రాంతమైన వెంకటాపురం మండలంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేగడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్న రాజకీయ నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ఉండాలని వారికి సూచించినట్లు సమాచారం, ఈవార్తల నేపథ్యంలో మన్యం ప్రాంతంలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Share it:

Post A Comment: