ఆదివాసీ నాయకులు గట్టిపల్లి బాలకృష్ణ డిమాండ్
మన్యం టీవీ మంగపేట.
తరాతరాలుగా దళితులతో పాటు ఆదివాసీలు కూడా సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబాటుతనానికి గురి అయి ఉన్నారు. దళిత ప్రజలకోసం ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ద్వారా పది లక్షలు మంజూరు చేసి తద్వారా దళితులను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే నిర్ణయం కెసిఆర్ తీసుకోవడం చాలా హర్షించ దగ్గ విషయం అదే విధంగా ఆదివాసీలకోసం గిరిజన బంధు ఏర్పాటు చేసి తద్వారా గిరిజన ప్రజలను ఆర్ధిక, సామాజిక, రాజకీయంగా బలోపేతం చేయాలనీ ఈ సందర్బంగా ఆదివాసీ నాయకులు గట్టిపల్లి బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేసారు.
తెలంగాణ ప్రభుత్వం గిరిజన బంధు కూడా అమలు చేయాలి ప్రతి ఈ పూజారి ప్రభాకర్, మడివి సతీష్ కూడ ప్రభుత్వం గిరిజన కుటుంబానికి 10లక్షలు రూపాయలు ఇవ్వాలి గిరిజన అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పాటు పడాలి అని ఈ సందర్బంగా కోరారు.ఈ కార్యక్రమం లో మంగపేట ఆదివాసీ వర్కింగ్ ప్రేసిడెంట్ పూజారి ప్రభాకరరావు వైస్ ప్రేసిడెంట్ మడి సతీష్ కార్యదర్శి గట్టిపల్లి బాలకృష్ణ సభ్యులు కొమరం నర్ససింహారావు పోలేబొయిన నాగార్జున సురేష్ కొమరం గణేష్ బాలకృష్ణ మంకిడి అనిల్ చీమల నాగభూషణంచౌలం బాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: