👉కూసపాటి శ్రీనివాస్ కలెక్టర్ కు వినతి పత్రం.
మన్యం టీవీ, కొత్తగూడెం, జూలై 19, కొత్తగూడెం మునిసిపాలిటీ పరిధిలో గతంలో ఇచ్చిన ఇంటి క్రమబద్ధీకరణ పట్టాలలో ఇంటి నెంబర్లు, ఇంటి స్థలం కొలతలు, ఇంటి యజమాని పేర్లు, సరిహద్దుల్లో తప్పులు దొర్లాయని, ఈ విషయమై వెంటనే తగు చర్యలు చెప్పట్టాలని అంబేద్కర్ భవన్ డవలప్మెంట్ సొసైటీ చైర్మన్ కూసపాటి శ్రీనివాస్ అన్నారు...సోమవారం నాడు జిల్లా కలెక్టర్ అనుదీప్ ని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రన్ని అందజేయడం జరిగింది...ఈ సందర్భంగా కూసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ఇంటి పట్టాలలో సుమారు వందకు పైగా తప్పులతో కూడిన పట్టాలు ఇవ్వడం జరిగింది సుమారు పది నెలల అవుతున్న ఎం ఆర్ ఓ, ఆర్ డి ఓ, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఇంకా హైదరాబాద్ సి సి ఎల్ ఏ, డిపార్ట్మెంట్ కి పంపించ కుండా జాప్యం జరుగుతోంది అని వివరించడం జరిగింది...ఈ విషయమై వెంటనే జిల్లా కలెక్టర్ అనుదీప్ స్పందించి హైద్రాబాద్ సిసిఎల్ఎ, నీ సంప్రదించి వెంటనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది...ఈ కార్యక్రమంలో ఎస్ కె. అలిమ్, పి.విజయ భారతి, సిహెచ్.సాంఎల్, కందుకూరి బ్రహ్మయ్యలు పాల్గొన్నారు.
Post A Comment: