మన్యం టీవీ, అశ్వాపురం:ప్రభుత్వ విప్, పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు సీతమ్మసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూము వాలు కోల్పోతున్న నిర్వాషితులు గత కొన్ని రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజెసిన ఎంపీపీ ముత్తినేని సుజాత,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్.ఈ సందర్భంగా భూ నిర్వాషితులకు మెరుగైన ప్యాకేజ్ వచ్చేలా పినపాక శాసన సభ్యులు రేగాకాంతా రావు గారి ఆధ్వర్యంలో ప్రయత్నం చేస్తామని రైతులు ఎవరు అదైర్యపదవద్దని మీకు తగిన న్యాయం జరిగేలా చేస్తామని ఎంపీపీ అన్నారు.వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,ఎంపీటీసీ కొర్ష ముత్తయ్య,తెరాస మండల నాయకులు కిలారి శేషగిరి,మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ, ఎస్ డి అబ్జల్,కన్నెబోయిన సూర్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: