----డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల.
మన్యం టీవీ పాల్వంచ :-
మానవ మనుగడకు మొక్కలే జీవనాధారమని ప్రతి ఒక్కరూ మొక్కలను విరివిగా నాటాలని *డీ.సీ.ఎం.ఎస్ వైస్ చైర్మన్, పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు. పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోని కొత్త సూరారం గ్రామంలో హరితహారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ నాటి నా మొక్కలను సంరక్షిస్తే భావితరాలకు ఎంతగానో ఉపయోగపడతామన్నారు.
రానున్న రోజుల్లో ఆరోగ్యవంతమైన జీవితానికి ఆక్సిజన్ ఎంతో అవసరమని, చెట్ల వల్లనే మనకు స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు హరితహారం ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు.
ఈ కార్యక్రమంలో *పాల్వంచ కోఆపరేటివ్ సొసైటీ వైస్ చైర్మన్ కాంపల్లి కనకేష్, కొత్త సూరారం పంచాయితీ సర్పంచ్ బానోత్ రవీందర్, పంచాయతీ కార్యదర్శి ఎంపీటీసీ భూక్యాశంకర్, సొసైటీ డైరెక్టర్లు బుడగం మోహన్ రావు, కనగాల నారాయణరావు, భూక్యా కిషన్,యర్రంశెట్టి మధుసూదన్ రావు,చౌగాని పాపారావు, మైనేని వెంకటేశ్వర్లు రావు (బాబు), సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి* తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: