మన్యంమనుగడ, దుమ్ముగూడెం:
ఇటీవలే జరిగిన క్లోరిన్ గ్యాస్ లీకేజీ పై అధికారులతో పర్ణశాల క్రాస్ రోడ్ వాటర్ గ్రిడ్ లో సమీక్ష నిర్వహించి అధికారులకు తగు సూచనలు చేసిన భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య .ఘటన జరిగిన 3గంటల దాక అధికారులు స్పందించకపోవడం, టెక్నీషియన్ లు లేకుండా గ్యాస్ ఓపెన్ చేయడం, ముందస్తు జాగ్రత్త ఉపకరణాలు ఏమి లేకపోవడం, ప్రమాదం జరిగిన తరువాత ప్రజలకు వార్నింగ్ ఇవ్వడానికి కనీసం అలారం వ్యవస్థ లేకపోవడం, ఇంత ప్రమాదం జరిగిన కనీసం ఏఇ రాకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన శాసనసభ్యులు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న జడ్ పి టి సి తెల్లం సీతమ్మ, యం పి పి రేసు లక్ష్మీ, సర్పంచ్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు,డి ఈ ఆర్ ఎస్, డి ఈ గ్రిడ్,మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీవో, SI, స్పెషల్ ఆఫీసర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: