మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కొండాయిగూడెం గ్రామంలో ని జడ్పీ హైస్కూల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన గోదావరి ముంపు పునరావాస కేంద్రాన్ని శనివారం తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,రేగా కాంతారావు పరిశీలించారు. నీరు,కరెంట్,వైద్య,భోజన సదుపాయాల ఏర్పాటు పై అధికారులని వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్ పాల్గొన్నారు.వైద్య,భోజన సదుపాయాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.ముందస్తు చర్యలలో భాగంగా ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు జెడ్పిటిసి పొశం.నరసింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ చంద్ర శేఖర్,డాక్టర్ మౌనిక,ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: