👉డబల్ బెడ్ రూమ్ కాలనీ గిరిజన వాసులు ఆవేదన
మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(జులై23):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, పెంట్లం గ్రామ పంచాయతీలోని డబల్ బెడ్ రూమ్ కాలనీలో ఎడతెరిపి లేకుండా ఐదు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు, దారి మొత్తం బురదమయంగా తయారై,ఇళ్ళ చుట్టూ నీరు నిల్వ ఉండి. కాలనీ వాసులైన గిరిజనులు నిత్యావసర సరుకుల కోసం దుకాణాలకు వెళ్లడానికి అడుగు బయట పెట్టాలంటే, చాలా ఇబ్బందిగా ఉందని.వర్షాకాలంలో తాము సీజనల్ వ్యాధుల బారిన పడకుండా, వారి సమస్యను గుర్తించి, గ్రామ పంచాయతీ పెద్దలు, మండల అధికారులు స్పందించి, తమ కాలనీ రహదారికి మరియు నీరు నిల్వ ఉండే ప్రదేశాలలో గ్రావెల్ మట్టి పోపించవలసిందిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Post A Comment: