గుండాల జూలై 2 (మన్యం టీవీ) ప్రభుత్వం తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం జులై 1 నుండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పది రోజుల పాటు కొనసాగనుంది శుక్రవారం గుండాల తాశీల్దార్ శుక్రవారం ఆర్ రమేష్ ముతపురం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని వీధులన్నీ శుభ్రపరచడం జరుగుతుందన్నారు. హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటడం కూడా చేపడుతున్నామన్నారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాలి , సర్పంచ్ పూనెం సమ్మయ్య , అధికారులు పంచాయతీ సెక్రెటరీ పాల్గొన్నారు.
Post A Comment: