మన్యం మనుగడ, పినపాక:
బెంగాలీ కూలీలు వేసే నాటుతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని మణుగూరు సబ్ డివిజన్ వ్యవసాయ సంచాలకులు తాతారావు అన్నారు. ఈ మేరకు ఆయన పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో బెంగాలీ కూలీలు వేస్తున్న వరి నాట్లను పరిశీలించారు. ఈ విధానంతో రైతుకు పది వేల రూపాయల వరకు పెట్టుబడి ఆదా అవడంతో పాటు అధిక దిగుబడి రావడం జరుగుతుందన్నారు. రైతులందరూ ఈ విధానాన్ని అవలంబించాలని ఆయన సూచించారు.
Post A Comment: