మన్యం టీవీ,బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని బీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ సంగం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం అయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పోలవరం ముంపు మండలాలను గుర్తించి వారికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, వర్షాకాలం రావడంతో వరదలు ఎక్కువగా వుండటం వలన పోలవరం ప్రాజెక్ట్ వలన లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం వుంది. వారికి తక్షణమే నష్ట పరిహారం ఇప్పించాలని బీసీ సంగం డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి, మండల ఉపాధ్యక్షులు ఆకుల రఘు , మండల నాయకులు నిధానపల్లి బాలకృష్ణ,బొంతపల్లి రాము, నరసింహారావు బీసీ విద్యార్థి నాయకులు రఘు, నవీన్, నరేంద్ర, దినేష్ పాల్గొన్నారు.
Post A Comment: