మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం దమ్మకపేట గ్రామ పంచాయతీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు ఆదేశాల మేరకు గురువారం దమ్మకపేట గ్రామ పంచాయతీ లో జరుగుతున్న పల్లె ప్రగతి, పారిశుధ్యం,అభివృద్ధి పనులు వైకుంఠదామం మరియు డంపింగ్ యార్డ్ పనులను ఎంపీపీ కారం విజయకుమారి అధికారులు,ప్రజాప్రతినిధుల తో కలిసి పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలి అని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నరసింహారావు,ఎంపీడీఓ వీరబాబు,ఎంపీఓ వెంకటేశ్వర్లు,సర్పంచ్ రాంబాబు,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, టిఆర్ఎస్ నాయకులు తంత్రపల్లి కృష్ణ,మేకల.రవి, స్థానిక నాయకులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: