CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసిన దుమ్ముగూడెం మండలం పొడు రైతులు

Share it:

 



మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, పైడి గూడెం గ్రామ పంచాయతీకి చెందిన సుజ్ఞానపురం కు చెందిన పొడు రైతులు గురువారం మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి వారి సమస్యలను వివరించారు. పొడు వ్యవసాయం,సాగు చేసుకుంటు జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను 9 మంది కి చెందిన సుమారు 30 ఎకరాల భూమిలో పత్తి విత్తనాలు నాటడం జరిగింది అని,అట్టి భూమిని ఫారెస్ట్ అధికారులు జెసిబి సహాయంతో ట్రెంచ్ పనులు పూర్తి చేస్తున్నారని,ఫారెస్ట్ అధికారుల నుండి తమకు న్యాయం జరిగేలా చూడలని విప్ రేగా కాంతారావు కు వినతి పత్రం అందజేశారు. సమస్యపై స్పదించిన విప్ రేగా కాంతారావు సంబంధిత అధికారులతో మాట్లాడి తగు న్యాయం జరిగేలా చూస్తాను అని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,రైతులు కె.గంగరాజు,కె.నాగరాజు, కె.వలసమ్మ,కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: