మన్యం మనుగడ, పినపాక:
నాలుగవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పినపాక మండల జెడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి టి.కొత్తగూడెం పంచాయతీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని గ్రామ సమస్యలను విని ఈ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది. పల్లె ప్రగతి లో భాగంగా పంచాయితీలో హరితహారం, పారిశుద్ధ్యం పనులను చక్కగా పూర్తి చేసి ఇ ఆదర్శ పంచాయతీగా పేరు తెచ్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కణితి చిన్నక్క, ఉపసర్పంచ్ నాగలక్మి, పంచాయతీ సెక్రటరీ అనూష, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: