గుండాల /ఆళ్ల పల్లి జూలై 1 (మన్యం టీవీ) పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ముత్యం రమేష్ ముత్యం రమేష్ నిర్వహించారు. ఆళ్ల పల్లి మండలం పరిధిలోని అడవి రామారం గ్రామంలోని వలస ఆదివాసీలకు గుండాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ నిర్వహించారు. అనంతరం గుండాల ఎస్ ఐ ముత్యం రమేష్ మాట్లాడుతూ. వలస ఆదివాసులు ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో వారిని ఆదుకోవాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో మండలంలో ఉన్న వలస ఆదివాసీలకు సహాయాన్ని అందిస్తున్నామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించ వద్దని ఆయన కోరారు. గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చినట్లయితే పోలీస్ వారికి తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు
Navigation
Post A Comment: