CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీతంపేట బంజర్ లో అనారోగ్యంతో మృతి చెందిన జడ్పిటిసి బిందు చౌహాన్ తాత మృతదేహానీ కి నివాళులు అర్పించిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 5:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం నాడు

సుజాతనగర్ జెడ్పిటిసి బిందు చౌహాన్ తాత మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు లౌడియా సౌమ్య నాయక్ తండ్రి అయిన లౌడియా ఈరియ నాయక్ సోమవారం నాడు తెల్లవారుజామున మరణించినారు, ఈ విషయం తెలిసి హుటాహుటిన సీతంపేట బంజర్ లోని జెడ్పిటిసి బిందు చౌహాన్ స్వగృహానికి వెళ్లి ఈరియ నాయక్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించి, జెడ్పిటిసి బిందు చౌహాన్ కుటుంబాన్ని ఓదార్చి , వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు.

వనమా రాఘవ వెంట ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, లౌడియా సత్యనారాయణ (సంపు) సొసైటీ డైరెక్టర్ చందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోడ హరి మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: