CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాడివేడిగా సర్వసభ్య సమావేశం

Share it:

 


 👉నాలుగు నెలలుగా పాలు రావడం లేదని ఐ సి డి ఎస్  సూపర్వైజర్ పై ఎంపీపీ ముక్తి సత్యం ఆగ్రహం

 గుండాల జూలై 5  (మన్యం టీవీ) వాడివేడిగా సర్వసభ్య  సమావేశం సాగింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో  కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని  సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమంపై సభలో ముందుగా ముందుగా చర్చించారు. అనంతరం  అంగన్వాడి కేంద్రాలకు  పాలు రావడంలేదని సమావేశంలో ఎంపీపీ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సాలమ్మ పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.   మండలంలో ఉన్న అంగనవాడి కేంద్రాలకు పాలు సరఫరా చేయకుండానే  చేసినట్టు  వేలిముద్రలు  వేసి పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు. దీనితోపాటు సీజనల్ వ్యాధులు  వ్యాపించకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని ఎంపీపీ అధికారులను ఆదేశించారు . గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పకడ్బంది ప్రణాళికలు  చేయాలని అన్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ సమావేశానికి కూడా అధికారులు సగానికిపైగా హాజరు కాకపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో  వాలి , తాసిల్దార్ రమేష్ ,  మిషన్ భగీరథ డి ఈ పద్మావతి , పిఎసిఎస్ చైర్మన్  రామయ్య , సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: