👉నాలుగు నెలలుగా పాలు రావడం లేదని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ పై ఎంపీపీ ముక్తి సత్యం ఆగ్రహం
గుండాల జూలై 5 (మన్యం టీవీ) వాడివేడిగా సర్వసభ్య సమావేశం సాగింది. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా పల్లె ప్రగతి కార్యక్రమంపై సభలో ముందుగా ముందుగా చర్చించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాలకు పాలు రావడంలేదని సమావేశంలో ఎంపీపీ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సాలమ్మ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఉన్న అంగనవాడి కేంద్రాలకు పాలు సరఫరా చేయకుండానే చేసినట్టు వేలిముద్రలు వేసి పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు. దీనితోపాటు సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని ఎంపీపీ అధికారులను ఆదేశించారు . గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా పకడ్బంది ప్రణాళికలు చేయాలని అన్నారు. ఎప్పటి మాదిరిగానే ఈ సమావేశానికి కూడా అధికారులు సగానికిపైగా హాజరు కాకపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వాలి , తాసిల్దార్ రమేష్ , మిషన్ భగీరథ డి ఈ పద్మావతి , పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు
Post A Comment: