మన్యం టీవీ : ఇల్లందు
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం గార్ల మండలం పోచారం గ్రామపంచాయతీ పాత పోచారం గ్రామంలో పోడు భూములకు పట్టాలు ఉన్నప్పటికీ మెగా పార్క్ కోసం అంటూ పట్టాలు ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని సూచిస్తున్నారు అని కాంగ్రెస్ నేత చీమల వెంకటేశ్వర్లు మండిపడ్డారు. 2004 నుండి 2009 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టాలు ఉన్నాకూడా రైతు బంధు పథకం వస్తున్నా కూడా గిరిజనుల భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయంపై పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనియఆకుల రామారావు ఇల్లందు టౌన్ ప్రెసిడెంట్ దొడ్డ డానియల్, సురేష్, అల్లం వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు కల్తీ వెంకటేశ్వర్లు, నగేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.
Post A Comment: