CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో పోరాడాలి...

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టు పెట్టి కార్మిక, కర్షక, రైతు హక్కులను హరిస్తున్న బీజేపీ ప్రభుత్వ న్నీ గద్దెదింపాలంటే ప్రతి ఒక్కరు క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో పోరాడాలని వ్యవసాయ కార్మిక సంగం జిల్లా నాయకులు అబ్దుల్ నబి పిలుపునిచ్చారు.ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ మండల కన్వీనర్ ఆలేటి కిరణ్ అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల పేరుతో మతాల పేరుతో మనుషుల మధ్య విద్వేషాలు పెంచడమే కాక మహిళలకు రక్షణ కల్పించడం లో కూడా ఈప్రభుత్వం విఫలమైందని అన్నారు.సుమారు 8నెలల నుండి రైతులు మా హక్కులను కలరాసే చట్టాలను వ్యతిరేకిస్తూ ధర్నాలు చేస్తుంటే ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదాని ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల చట్టాలను రద్దు చేసి 4 కోడ్లుగా మలచి ప్రశ్నించే హక్కు లేకుండా బానిసలుగా మార్చుతున్నారు.ఇలాంటి ప్రభుత్వంను కేసీఆర్ వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి సమర్ధించడం సరైంది కాదన్నారు. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుటకు దశల వారి అందోళన చెయ్యాలని కోరారు.ఈ సమావేశం లో నాయకులు దేవులపల్లి యకయ్య ఈసం వెంకటమ్మ,తాళ్లూరి కృష్ణ,వజ్జ సురేష్,జేబునిస్స ఆలేటి సంధ్య,కె.మరియ. ఫాతిమా,పద్మ,అప్సర,కె.వెంకటమ్మా,అభిమన్యు,ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: