👉బూర్గంపాడు లో వైద్యులను ఘనంగా సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం మనుగడ, బూర్గంపాడు: వైద్యుల సేవలు వెలకట్టలేనివి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు అన్నారు. ఆయన జాతీయ వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని బూర్గంపాడు లో వైద్యులను ఘనంగా సన్మానించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు .ఇటీవల కాలంలో జిల్లాలో నూతన వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందాని, అలాగే వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లా కేంద్రాలలో అనేక రోగాలకు పరీక్షలు చేసుకునే విధంగా డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలోజెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: