CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి గ్రామ సభ నిర్వహించిన సర్పంచ్

Share it:

 


  గుండాల /ఆళ్ల పల్లి జూలై 1 (మన్యం టీవీ) ఆళ్ల పల్లి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్  మెస్  కోటేశ్వరరావు  గ్రామ సభను నిర్వహించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని జూలై ఒకటి నుండి నిర్వహిస్తుందని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయాలన్నారు.   పంచాయతీలో  ఉన్న అన్ని గ్రామాల్లో పల్లె ప్రగతి  కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన కోరారు. హరిత హారంలో నాటిన మొక్కలు బ్రతికేలా  ప్రణాళికలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య ,  ఎంపీడీవో మంగమ్మ , కార్యదర్శి అన్వేష్ , వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: