మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా మారుమూల ఏజన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పి గౌస్ ఆలం వివరాలను వెల్లడించారు నిషేదిత సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందిన అగ్రనాయకులైన బడే చొక్కరావు అలియాస్ దామోదర్,కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకన్న, కొయ్యడ సాంబయ్య ఆజాద్ మైలారపు ఆదేలు,భాస్కర్ బండి
ప్రకాష్ బండి దాదా,పుల్లూరి ప్రసాదరావు,చంద్రన్న,కుర్మంవీరన్న, భద్రుతో పాటు వాజేడు వెంకటపురం ఏరియా కమిటీ సెక్రెటరీ సుధాకర్ ఆదేశాల మేరకు చెలిమెల పామునూరు సభ్యులు కొంతమంది అడవుల్లోకి కూంబింగ్ చేసుకుంటూ వచ్చే పోలీస్ బలగాలను హతమార్చాలనే
ఉద్దేశ్యంతో సాయుధులై సమావేశమై పథకం రచించి కుట్రపన్ని తడపాలనుండి పూజారి కాంకర్ వెళ్ళే దారిలో పేలుడు సామగ్రిని అమరుస్తున్నారని గూఢచారి సమాచారం మేరకు వెంకపురం పోలీసులు వారిని సామగ్రిని ప్రత్యేక బలగాలతో పట్టుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో వెంకటాపురంసీఐ శివప్రసాద్,ఎస్ఐతిరుపతి వాజేడు ఎస్ఐతిరుపతి రావుపాల్గొన్నారు
Post A Comment: