మన్యం టీవీ కొత్తగూడెం, జూలై 16 :- శుక్రవారం నాడు పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ
భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెం అమరవీరుల స్తూపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ అబిద్, కొత్తగూడెం అసెంబ్లీ ప్రెసిడెంట్, గడ్డం రాజశేఖర్, కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బానోత్ కోటేష్ నాయక్, ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది
రేవంత్ రెడ్డి ని బేషరతుగా విడుదల చేయాలని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ లో దహనం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
Post A Comment: