CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో ఆహార భద్రత కార్డులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) అశ్వాపురం మండలానికి సంబంధించి 621 ఆహారభద్రత కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్,పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు రేగా కాంతారావు రైతు వేదిక క్లస్టర్ ఆవరణలో పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ ఆహార భద్రత కార్డుల యొక్క ఉపయోగాలు రేషన్ విధానం గురించి కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపకుండా ప్రజలకు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం తెచ్చిన పలు పధకాలను గురించి వివరించి కొనియాడారు. అదేవిధంగా నేను ఇచ్చిన హామీలను కచ్చితంగా పూర్తి చేస్తాను అని ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ఎంపీపీ ముత్తినేని సుజాత, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ రవీంద్ర ప్రసాద్, జిల్లా మరియు మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరిపుద్దీన్, ఎస్ కె.ఖదీర్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోడి అమరేందర్, జిల్లా రేషన్ డీలర్స్ అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు, మండలంలోని పలువురు సర్పంచులు, ఎంపీటీసీ లు రెవిన్యూ సిబ్బంది, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: