చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :
జిల్లా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సారెపల్లి శేఖర్ ను ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పరామర్శించారు. ఇటీవల సారెపల్లి శేఖర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారి కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్తితి మెరుగుపడటంతో డాక్టర్లు అతన్ని డిచ్చార్జ్ చేశారు. ఇదే విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సోమవారం సారేపల్లి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, ఎంపీపీ భానోత్ పార్వతి, వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షులు నాయకులు బోజ్యా నాయక్, ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ పవన్, ఎంపీటీసీ దారా బాబు, సత్తి నాగేశ్వరరావు, భూపతి శ్రీనివాసరావు, సొసైటీ డైరెక్టర్ ఉన్నం నాగరాజు, సురా వెంకటేశ్వర్లు, బాబురావు, గాదె లింగయ్య, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: