మునిగిన సీతమ్మ నారా చీరల ప్రాంతం
మన్యం మనుగడ, దుమ్ముగూడెం:
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది. SRSP ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాచలం దగ్గర భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అంతేకాదు.. సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని..ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు అధికారులు.
Post A Comment: