మన్యం టివి మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కొండాయిగూడెం గ్రామం, వద్ద గోదావరి నదీ ప్రవాహాన్ని శనివారం ప్రభుత్వ విప్ రేగా. కాంతారావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఐఏఎస్, అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు,ముంపుకు గురి అయ్యే ప్రాంతాల ను గుర్తించి వెంటనే అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు,తరలించాలన్నారు.ప్రజలకు ఎవరికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,తహసీల్దార్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ నాగప్రసాద్,ఎంపీడీఓ వీరబాబు,ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: