దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ
రాష్ట్ర అన్ని రంగాల్లో దూసుకుపోతుంది
నిధులు తెస్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగ
గుండాల జూలై 10 (మన్యం మనుగడ) అభివృద్ధి టిఆర్ఎస్ పార్టీ సాధ్యమని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం ఆయన గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా గుండాల మండలం లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ ,ఎర్రబెల్లి దయాకర్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , ఎంపీ మాలోత్ కవిత, బాలసాని లక్ష్మీనారాయణ తో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆళ్ల పల్లి మండలంలో ఎంపీ, జిల్లా పరిషత్ చైర్మన్, తో కలిసి పర్యటించి అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర తెలంగాణ అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో కెసిఆర్ నాయకత్వంలో దూసుకుపోతుంది అన్నారు. నిధులు నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఇప్పటికే ఇప్పటికే గెలుపొందిన నాటినుండి నిధులు మంజూరు చేయించి కొన్ని పనులను పూర్తి చేయించాం అన్నారు. మరింత నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలని ముఖ్యమంత్రి కెసిఆర్ మరిన్ని నిధులు కేటాయించే వారిని ఒప్పించి నిధులు తీసుకొస్తాం అన్నారు. వారితో పాటు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో నిధులను తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని అన్ని రంగాల్లో ముందుంచుతాను అన్నారు.
Post A Comment: