గుండాల జూలై 10 (మన్యం మనుగడ) గిరిజన సంస్థ వస్తువులను కొనుగోలు చేసిన ప్రజా ప్రతినిధులు. శనివారం మండలంలో పర్యటించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు , జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య , మహబూబాద్ పార్లమెంట్ సభ్యులు మాలోత్ కవిత, సహకార సంస్థ భవనాన్ని ప్రారంభించి అందులో లభించే గిరి వికాస్ వస్తువులను వారు కొనుగోలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన సహకార సంస్థలు లభించే అన్ని వస్తువులు నాణ్యతగా ఉంటాయని అన్నారు. అతిధులకు డివిజన్ మేనేజర్ వాణి ఆ వస్తువులను అందించారు
Post A Comment: