మన్యం టీవీ కొత్తగూడెం, జులై 10 :- శనివారం నాడు
పట్టణ ప్రగతి మూడో విడతలో భాగంగా 10వ రోజు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి వార్డులు సందర్శించరు.
ఈ యొక్క కార్యక్రమంలో చైర్ పర్సన్ వార్డుల్లో మొక్కలు నాటి, అనంతరం వార్డు సభ్యులతో ద్విచక్రవాహనంపై వార్డలను సందర్శించి వార్డులో ఉన్నటువంటి డ్రైన్స్, రోడ్డు లను మరియు మంచినీటి సమస్యలను వార్డు లోని ప్రజలను అడిగి వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదిన తీర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించరు.
అలాగే పదిహేనవ వార్డు నందు ప్రకాశం స్టేడియం రోడ్ ఎదుట వర్షపు నీళ్లు ఆగి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని తెలుసుకున్న చైర్ పర్సన్, మున్సిపల్ కమిషనర్ నీ పిలిపించి పారిశుద్ధ కార్మికుల చే ఆ నీళ్లు పోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అనంతరం కాలువ నిర్మించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
ఈ యొక్క కార్యక్రమంలో వార్డ్ కౌన్సిలర్స్ వానచర్ల విమల,బోయిన విజయ్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్,ఏ ఈ సాహితీ, రాము, మున్సిపల్ జవాన్లు, స్పెషల్ ఆఫీసర్,వార్డ్ ఆఫీసర్స్,రిసోర్స్ పర్సన్స్,అంగన్వాడి మరియు ప్రజా ప్రతినిధులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
Post A Comment: